ఏపీకి మంచి రోజులే ప్రధాని మోడీ ప్రసంగంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో వారం రోజుల్లో ఎన్నికలు. ప్రచారానికి ఈ వారమే చివరివారం కావడంతో.ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.2014లో మాదిరిగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలసి పోటీ చేస్తున్నాయి.ఇదిలా ఉంటే సోమవారం ప్రధాని మోడీ( PM Modi ) ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.విశాఖ జిల్లా అనకాపల్లిలో( Anakapally ) నిర్వహించిన సభలో ప్రధాని మోడీ ఏపీ అభివృద్ధి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Good Days For Ap Chandrababu Key Comments On Prime Minister Modi Speech Details,-TeluguStop.com

కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలియజేశారు.దీంతో ప్రధాని మోడీ ప్రసంగంపై చంద్రబాబు( Chandrababu ) స్పందించారు.

ఏపీని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రధాని మోడీ భరోసా ఇవ్వటం చాలా సంతోషించదగ్గ విషయం.ఇక రాష్ట్రానికి అన్ని మంచి రోజులే.కూటమిగా ఎందుకు ఏర్పడ్డామో మోడీ, అమిత్ షా వివరించారు.ప్రజలు గెలవాలి.రాష్ట్రం నిలవాలి.రాష్ట్రంలో ఎన్డీఏ ( NDA ) గెలుపును ఎవరు అడ్డుకోలేరు.

ఈ ఎన్నికలలో అవినీతి వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్లటం ఖాయం.అధికారం ఉందని జగన్ విర్రవీగారు.25 లోక్ సభ, 160 అసెంబ్లీ స్థానాలలో కూటమిదే విజయం అని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ ఎన్నికల్లో సైకో జగన్ పోవాలని సెటైర్లు వేశారు.

కచ్చితంగా జరగబోయే ఎన్నికలలో కూటమి అధికారంలోకి రాబోతుందని చంద్రబాబు సంచలన ప్రసంగం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube