అర్హత వున్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకం అందుతుందా లేదా అని తెలుసుకోవడానికి పర్యటిస్తున్నాం జగనన్న వచ్చాకే కాపులకు కాపు నేస్తం అగరవర్ణలకు ఈబిసి నేస్తం ఇస్తున్నాంప్రతి గడపకు వెళ్తుంటే ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ మళ్ళీ జగనన్న రావాలని కోరుతున్నారు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే జగనన్న ప్రభుత్వం లక్ష్యం చంద్రబాబు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు వెలంపల్లి స్థానిక 38వ డివిజన్ లోని 113వ సచివాలయం పరిధిలో 86వ రోజు బుధవారం నాడు గడప గడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని బ్రాహ్మణ వీధి, వడ్డే వారి వీధి,అర్జున్ వీధి,గుంటూరు వారి వీధి,వాడపల్లి వారి వీధి,రాయల వారి వీధి మరియు తదితర ప్రాంతాలలో పర్యటించి గడప గడపకు వెళ్లి ప్రజలకు ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా జరిగిన సంక్షేమ పథకాల వివరాలు తెలియచేస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు
ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అందరికీ అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగిందన్నారు.ఇది చాలా చిన్న సచివాలయం అన్నారు.
అర్హత వున్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకం అందుతుందా లేదా అని తెలుసుకోవడానికి పర్యటించడం జరుగుతుందన్నారు.జగనన్న వచ్చాకే కాపులకు కాపు నేస్తం అగరవర్ణలకు ఈబిసి నేస్తం ఇవ్వడం జరుగుతుందన్నారు.
ప్రతి గడపకు వెళ్తుంటే ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ మళ్ళీ జగనన్న రావాలని కోరుతున్నారన్నారు.పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు దివిస్తున్నరన్నారు.
మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే జగనన్న ప్రభుత్వం లక్ష్యం అన్నారు.చంద్రబాబు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ,38వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రెహామతున్నిసా,హయత్,సంపరా రాంబాబు,విశ్వనాథ రవి, డీ దుర్గాప్రసాద్,బొమ్మ మధు,వజీర్ వివిధ డివిజన్ల కార్పొరేటర్లు,వివిధ కార్పొరేషన్ల చేర్మెన్లు,డైరెక్టర్లు,పార్టీ నాయకులూ, కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వాలంటరీస్ మరియు నగరపాలక సంస్థ మరియు రెవిన్యు అధికారులు తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.