జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేసి కడుపులో క్లాత్ వదిలేసి కుట్లు వేసిన ఘటనపై కలెక్టర్ యాస్మిన్ బాషా స్పందించారు.ఈ ఘటనపై విచారణ చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఇందుకోసం ముగ్గురు అధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు.ఈ నేపథ్యంలో ఆర్ఎంఓ చంద్రశేఖర్ రెడ్డి వివరాలను వెల్లడించారు.
నవ్యశ్రీ అనే మహిళకు 2021లో ఆపరేషన్ చేశామన్న ఆయన కడుపు నొప్పితో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్నట్లు తెలిసిందన్నారు.ఈ ఘటనలో ఎంతవరకు నిజం అనేది విచారిస్తున్నామని తెలిపారు.
దీనిపై సమగ్ర విచారణ జరిపి కలెక్టర్ కు నివేదిక అందజేస్తామని వెల్లడించారు.