ఈనెల 19వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ ఉంటుందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని సీఎం జగన్ చెప్పారన్నారు.
చెప్పినట్లుగానే రూ.425 కోట్ల వ్యయంతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని మంత్రి మేరుగ తెలిపారు.గతంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు.సమాజంలోని అసమానతలను తొలగించేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కృషి చేశారన్న ఆయన అంబేద్కర్ భావజాలంతోనే సీఎం జగన్ పాలన చేస్తున్నారని వెల్లడించారు.