నేడు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం తెలిసిందే.సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్రానికి రావలసిన నిధులు ఇంకా పెండింగ్ బకాయిలపై ముఖ్యమంత్రి చర్చించినట్లు సమాచారం.అదేవిధంగా పోలవరం పెండింగ్ నిధులను త్వరగా విడుదల చేయాలని వినతి పత్రం అందించినట్లు సమాచారం.
ఢిల్లీలోని ఆర్థిక శాఖ కార్యాలయంలో.వీరి భేటీ జరిగింది.
ఢిల్లీలో రెండు రోజులపాటు సీఎం జగన్ పర్యటన సాగనుంది.
గురువారం పలు కేంద్ర మంత్రులతో సమావేశమై శుక్రవారం ఉదయం విజ్ఞాన్ భవన్ లో వామపక్ష తీవ్రవాదం నిర్మూలన పై జరుగుతున్న సదస్సులో పాల్గొనబోతున్నారు.అదే సమయంలో రేపు రాత్రికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా సీఎం జగన్ భేటి కాబోతున్నట్లు సమాచారం.అదేవిధంగా కుదిరితే ప్రధాని మోదీతో కూడా.
సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.
చంద్రబాబు అరెస్టు తర్వాత తొలిసారి సీఎం జగన్ ఢిల్లీ వెళ్లడంతో.ఈ పర్యటన ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది.