రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట( Ellantakunta ) మండలంలోని అనంతారం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా మంగళవారం బిఆర్ర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా రాజన్న సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ప్రచారం లో పాల్గొని మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ( Brs Party ) అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్( B Vinod Kumar ) ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమం లో సర్పంచ్ ల ఫోరమ్ మండల మాజి ఉపాధ్యక్షులు, గ్రామ ఎక్స్ సర్పంచ్ బొల్లం వెంకటేశం, మార్కెట్ కమిటీ ఎక్స్ డైరెక్టర్ వొల్లాల రవీందర్, గ్రామ శాఖ అధ్యక్షులు మల్యాల రాజశేఖర్, వొల్లాల నర్సయ్య, అక్కేమ్ కొమురయ్య, వికృతి రవీందర్, గరిగే సత్యనారాయణ, మచ్చ ప్రభాకర్,నాయికి భాస్కర్, ఎలుక రాజయ్య, చింతలతాడేం ఎల్లయ్య,బట్టి క్రాంతి, గరిగే లక్ష్మణ్,ఉమ్మడి నర్సయ్య, రాము తదితరులు పాల్గొన్నారు.