దహన సంస్కారాలకు 10వేల ఆర్థిక సాయం అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి( Rudrangi ) లో నిరుపేద కుటుంబానికి చెందిన సుకినికంఠ చంద్రమోహన్ ముంబాయిలో కూలీపని చేసుకుంటు జీవనం సాగిస్తున్న క్రమంలో కడుపులో నొప్పి రావడంతో హాస్పిటల్ వెళ్లి చికిత్స జరుగుతుండగానే హఠాత్తుగా రాత్రి మరణించడంతో అక్కడివారు తలాకొన్ని డబ్బులు పొగుచేసి 30వేల రూపాయలు జమచేసి అంబులెన్సులో స్వగ్రామమైన రుద్రంగికి పంపించారు.

 10,000 Financial Assistance For Cremation-TeluguStop.com

అంత్యక్రియలకు కూడా డబ్బులులేని నిరుపేద కుటుంబం అని ట్రస్టు ద్వారా మీకు తోచిన ఆర్థికసాయం అందించండి అని కోరడంతో ట్రస్టు, ఇతరగ్రూపులలో పోస్టు చేయగా దాతలు స్పందించి 8289/- రూపాయలు అందించడంతో ట్రస్టు ద్వారా మరికొంత కలిపి మృతుని భార్య లతకు 10వేల రూపాయల నగదు అందజేయడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, పొలాస రాజేందర్, నంది సాయికుమార్, రుద్రంగి పట్టణానికి చెందిన పుట్టపాక జనార్ధన్, దాసు, నాగి ప్రవీణ్, కావ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube