ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నుండి కోలుకున్న తర్వాత బ్లాక్ ఫంగస్ బారిన పడుతూ అనేకమంది అవస్థలు పడుతున్నారు.ఉన్న కొద్ది ఫంగస్ కేసులు పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగంలో టెన్షన్ నెలకొంది.
మొదటి లో కృష్ణా జిల్లాలో అత్యధికంగా బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడగా ఇప్పుడు .ప్రకాశం జిల్లాలో భారీగా బయటపడుతున్నాయి.జిల్లాలో కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో జిల్లాలో ఇప్పటి వరకు 64 కేసులు బయటపడటం జరిగాయి.బాధితుల్లో 84 శాతం మంది షుగర్ వ్యాధిగ్రస్తులు.
జిల్లాలో పది రోజుల వ్యవధిలోనే బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రభుత్వ యంత్రాంగం పై ఒత్తిడి పెరిగింది.64 మంది లో ఎనిమిది మంది చికిత్స చేయకముందే మరణించడం జరిగింది.ప్రస్తుతం 41 మంది జీజీహెచ్ లో మరికొంతమంది ఇంటివద్దనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.మరికొంతమంది చెన్నై ఇంకా మరి కొన్ని ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.రోజుల వ్యవధిలో కేసులు ప్రకాశం జిల్లాలో పెరిగిపోతుండటంతో .చికిత్స ఒక్క జీజీహెచ్లో మాత్రమే బ్లాక్ ఫంగస్ కి దొరుకుతూ ఉండటంతో .వైద్యులపై ఒత్తిడి పెరిగిపోయింది.మరోపక్క బాధితులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.