నిత్యం స్నానం చేయడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే.దేహాన్ని శుభ్రంగా ఉంచడమే కాదు, మానసిక ఉల్లాసానికి, ఉత్తేజానికి కూడా స్నానం ఎంతగానో ఉపయోగపడుతుంది.
అయితే ఇప్పుడు చెప్పబోయే పలు సూచనలు పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది.
వేడి నీతితో స్నానం చేయాలా? లేక చల్ల నీళ్ల స్నానం మంచిదా అని ఎంతో మందికి ఎన్నో అనుమానాలు ఉంటాయి.ఈ క్రమంలో వేడి నీళ్ల స్నానం వల్ల కలిగే లాభం ఏంటో చూడండి.ముఖ్యంగా.రోజూ వ్యాయామం చేయని వారు రోజూ వేడినీటి స్నానం చేయడం ద్వారా.కొంతమేర వ్యాయామం చేసిన ఫలితం కలుగుతుందని వారు అంటున్నారు.
వ్యాయామం చేయడం ద్వారా శరీరంలో వేడి పుడుతుంది.అలాగే వేడినీటి స్నానంతోనూ అదే ప్రక్రియ జరుగుతుందని తేల్చారు.
ఇందుకోసం 2,300 మంది మధ్య వయసు వ్యక్తులను దాదాపు 20 ఏళ్లపాటు పరిశీలించారు.
ఎక్కువ సార్లు ఆవిరి స్నానం చేసే వారిలో గుండెపోటు, ఇతర గుండె సమస్యల ముప్పు తగ్గుతున్నట్లు ఈ పరిశోధనలో గుర్తించారు.
వేడినీటి స్నానం చేయడం ద్వారా.వారిలో 140 క్యాలరీలు కరిగినట్లు గుర్తించారు.ఇది 30 నిమిషాల వేగమైన నడకతో (బ్రిస్క్ వాక్) సమానం.గంట సైకిల్ తొక్కడం ద్వారా వారిలో సరాసరిన 630 క్యాలరీలు కరిగాయి.
వేడినీటి స్నానం సైకిలింగ్ వ్యాయామంతో సమానం కాకపోయినా.పెద్దమొత్తంలో క్యాలరీలను కరిగినట్లు అధ్యయనంలో తేలింది.