కామెడీ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ గా టాలీవుడ్ లో రాజేంద్రప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేష్.తండ్రి దర్శకత్వంలో అల్లరి సినిమాతో హీరోగా టాలీవుడ్ లో అడుగుపెట్టి తరువాత సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొని తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు.
అయితే కెరియర్ పరంగా ఆ కామెడీ హీరో అనే ఇమేజ్ ని అల్లరి నరేష్ మోయలేకపోతున్నారు.అతని నుంచి కామెడీ కంటెంట్ తో సినిమాలు వస్తున్నాకూడా అందులో ఏ ఒక్కటి ప్రేక్షకులని మెప్పించడం లేదు.
దర్శకులు రొటీన్ కథలనే కామెడీ అంటూ ప్రెజెంట్ చేయడం, నరేష్ కూడా ఫుల్ కామెడీ అంటూ ఒకే చెప్పేసి నటిస్తున్నారు.దీంతో అలా వచ్చిన సినిమా డిజాస్టర్ అవుతూ వస్తున్నాయి.
ఈ వరుస ఫ్లాప్ ల కారణంగా అతని మార్కెట్ కూడా దారుణంగా పడిపోయింది.
ఈ నేపధ్యంలో ఒకే జోనర్ కి స్టిక్ అయితే ఇలానే ప్రమాదంలో పడతామని గ్రహించిన అల్లరి నరేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాలో కాస్త సీరియస్ నెస్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించాడు.
మరి ఈసారి పూర్తిస్థాయిలో సీరియర్ రోల్ లో నాంది అనే సినిమా చేశాడు.విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చివరి దశకి వచ్చేసి రిలీజ్ కి రెడీ అవుతుంది.
ఇక ఈ సినిమాకి అమెజాన్ ప్రైమ్ నుంచి మంచి డీల్ వచ్చినట్లు తెలుస్తుంది.పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఇస్తామని అమెజాన్ వారు నాంది టీంకి ఆఫర్ చేశారని టాక్.
అయితే సినిమా మీద అల్లరి నరేష్ గట్టి నమ్మకంతో ఉన్నారని, అలాగే నిర్మాతలు కూడా హిట్ గ్యారెంటీ అని నమ్ముతూ ఉండటంతో అమెజాన్ వారితో సంప్రదింపులు జరుపుతున్నారని టాక్ వినిపిస్తుంది.