బాలీవుడ్లో సౌత్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది.అక్కడ వరుసగా మన సినిమాలు రీమేక్ అవుతున్నాయి.
మరీ ముఖ్యంగా గత రెండు మూడు సంవత్సరాలుగా తెలుగు సినిమాలను వారు వరుసగా రీమేక్ చేస్తూనే ఉన్నారు.ప్రస్తుతం కూడా దాదాపు అరడజను సినిమాలు రీమేక్ అవుతున్నాయి.
అందులో అల వైకుంఠపురంలో, జెర్సీ ఇంకా కొన్ని ఉన్నాయి.ఇప్పుడు మన ‘పరుగు’ సినిమాకు అక్కడ సీక్వెల్ రాబోతుంది.
ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పరుగు సినిమాను అప్పట్లోనే హిందీలో పంతి అనే టైటిల్ తో రీమేక్ చేశారు.
జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ పరుగు రీమేక్తో బాలీవుడ్లో అడుగు పెట్టాడు.ఆ సినిమాకు మంచి స్పందన వచ్చింది.ప్రస్తుతం టైగర్ బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు దక్కించుకున్నాడు.ఈ సమయంలో హిందీ పరుగు రీమేక్ కు ఓకే చెప్పాడట.
తెలుగులో చేయని సీక్వెల్ను హిందీలో చేయబోతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా చర్చ మొదలయ్యింది.
సాజిద్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సీక్వెల్లో బన్నీని కూడా నటింపజేయాలనే నిర్ణయానికి వచ్చారట.బన్నీ నటించడంతో బాలీవుడ్తో పాటు టాలీవుడ్ మరియు మలయాళ ప్రేక్షకులను కూడా ఆకర్షించవచ్చు.అందుకే పంతికి సీక్వెల్ను భారీ ఎత్తున చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.ప్రస్తుతం టైగర్ చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత పంతి 2 మొదలయ్యే అవకాశం ఉంది.
ఇక ఈ పంతిలో బన్నీ నటించేందుకు ఓకే చెప్తాడా లేదా అనేది కూడా చూడాలి.