తెలంగాణలో ఏ టీఆర్ఎస్ నేతమీదైనా సరే ఒంటికాలుపై లేచి యుద్ధం చేయగల తెగింపు ఉన్న ఒకేఒక్క టీడీపీ నేత రేవంత్ రెడ్డి.ఇప్పటికే ఎన్నో అంశాల్లో కేసీఆర్, కేటీఆర్ లపై బహిరంగ మాటల యుద్దానికి దిగి అనేక సార్లు హైలైట్ టీడీఎల్పీ నేత రేవంత్ తాజాగా ఓ అంశంలో మాత్రం కేసీఆర్ తో లేఖా రాజకీయం నడిపారు.
ఇంతకీ ఆ లేఖలోని ఆంతర్యమేమితంతే త్వరలో తెలంగాణలో జరగబోయే గ్రూప్ – 2 పరీక్షలు వాయిదా వేయాలని మరియు పోస్టుల సంఖ్యను సైతం పెంచాలని డిమాండ్ చేశారు.అలాగే గ్రూప్ – 3 నోటిఫికేషన్ విడుదల చెయ్యాలని, ఎక్సైజ్ ఎస్సై అభ్యర్థుల వయోపరిమితిలో సడలింపులు చెయ్యాలని, నకిలీ కోచింగ్ సెంటర్లు పెట్టి విద్యార్థులతో ఆడుకుంటున్న వారికి అడ్డుకట్టవేయాలని వివరించారు.
ఎప్పుడూ సవాళ్లు, విమర్శలతో చెలరేగే రేవంత్ ఈసారి ఇలా లేఖ మొత్తం ప్రజా ప్రయోజనాల గురించే ప్రస్తావించి వదిలేయడం చాలా విచిత్రంగానే అనిపిస్తోంది మరి.