నోటుకు ఓటు, బాబు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు రచ్చరచ్చ అవుతున్న నేపథ్యంలో అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి.నోటుకు ఓటు కుంభకోణంలో చంద్రబాబు నేరం చేశాడని న్యాయస్థానం తేల్చిచెబితే ఏమిటి పరిస్థితి? బాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సివస్తే ఆయన సీట్లో ఎవరు కూర్చుంటారు? ఇవి ప్రస్తుతానికి ఊహాగానాలే అయినా రేపు నిజం కావొచ్చు కదా అని కొందరు నాయకులు అంటున్నారు.ఇందుకు తమిళనాడును ఉదాహరణగా చెబుతున్నారు.అక్కడ ముఖ్యమంత్రి జయలలితను సిబిఐ ప్రత్యేక కోర్టు అక్రమాస్తుల కేసులో దోషిగా తేల్చగానే ఆమె ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు కదా.ఏపీలో కూడా అదే జరుగుతుందేమోనని అంటున్నారు.ఒకవేళ జరిగితే….
ముఖ్యమంత్రి ఎవరు? ఎక్కువమంది దృష్టి హిందూపురం ఎమ్మల్యే నందమూరి బాలకృష్ణ మీద ఉంది.ఆయనే పీఠంపై కూర్చుంటాడని అంటున్నారు.అయితే ఈ ఊహాగానాలకు బాలయ్య చెక్ పెట్టాడు.‘బావగారి స్థానం నేను తీసుకోను’ అని చెప్పాడట.చంద్రబాబే సీఎంగా కొనసాగుతారని అన్నాడు.అంటే బావగారు రాజీనామా చేసే పరిస్థితి రాదని బాలయ్య అభిప్రాయం.భవిష్యత్తు ఎవరికి తెలుసు?
.