దేశంలో మహిళలపై పోకిరీల ఆగడాలు అంతకంతకూ మితిమీరుతున్నాయి.స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళవుతున్నా వారి మనుగడ కొన్ని చోట్ల నేడు ప్రశ్నర్ధకంగా మారుతోంది.
మహిళలలు( Women ) బయట అడుగుపెడితే చాలు.కొన్ని దారుణమైన మనుషుల మధ్య నడవాల్సిన పరిస్థితి వస్తోంది.
ఇక అఘాయిత్యాలు, అత్యాచారాలు వంటి గురించి దేశంలో తరచూ వింటూనే వున్నాం.ఈ క్రమంలోనే తాజాగా బెంగుళూరులో( Bengaluru ) ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.
అర్థరాత్రి కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళను కొంత మంది పోకిరీ వెధవలు వెంబడించి తీవ్ర భయబ్రాంతులకు గురి చేయడం జరిగింది.కాగా దీనికి సంబందించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఆమె తన కారులో ( Car ) రోడ్డుపై ప్రయాణించగా రెండు బైకులపై ముగ్గురు, నలుగురు ఆకతాయిలు సదరు మహిళను వెంబడించారు.అంతేకాదు, కారు డోర్స్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఆమెని తీవ్రమైన భయబ్రాంతులకు గురిచేశారు.ఈ ఘటన బెంగుళూరులోని కోరమంగలాలో ( Koramangala ) జరిగినట్టు సమాచారం.అయితే దీనికి సంబంధించిన ఘటనను సదరు మహిళ ఎంతో చాకచక్యంగా వీడియో తీసి ఎక్స్ లో షేర్ చేసింది.
కాగా ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి జరిగినట్లు తెలుస్తోంది.అదే సమయంలో తన ఫోన్ నుండి హెల్ప్ లైన్లకు కాల్ చేసింది.తను ప్రయాణిస్తున్న కారును ముగ్గురు వెంబడిస్తున్నారని కంప్లైంట్ చేసింది.
ఈ క్రమంలో ఆమె వారితో మాట్లాడుతూ.‘నా పేరు ప్రియమ్ సింగ్.( Priyam Singh ) నన్ను ముగ్గురు రౌడీలు అదే పనిగా ఫాలో అవుతున్నారు.
నా కారు డోరు తీయడానికి ప్రయత్నిస్తున్నారు.నా కారును ఢీ కొంటున్నారు.
బైకుపై మొత్తం ముగ్గురు వ్యక్తులు నన్ను ఫాలో అవుతున్నారు.నా కారు ముందుకు వెళ్లి రోడ్డును బ్లాక్ చేసి మరీ నన్ను వెళ్లనివ్వకుండా ఆపడానికి ట్రై చేస్తున్నారు.
నేను వారి నుండి తప్పించుకుంటూ వేరే దారిలో వెళ్తున్నాను.రౌడీలు వెంబడిస్తున్న బైక్ నెంబర్ KA04LK2583.
నా కారు రిజిస్ట్రేషన్ నెంబర్ KA51MT5653′ అని చెబుతూ హెల్ప్ లైన్ వారికి సదరు మహిళ వివరాలను అన్నిటినీ తెలిపింది.ఇంకేముంది కట్ చేస్తే, ఆ ముగ్గురు ఆతాయిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం.
కాగా మహిళ దైర్యాన్ని చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.