భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సలార్ సినిమా (Salaar Movie) గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.ఈ సినిమాని ఒకసారి చూసిన చాలా మంది జనాలు మళ్ళీ మళ్ళీ చూడడానికి ఇష్టపడుతున్నారు.
ఇక ఈ సినిమాలోని పాత్రలన్నింటినీ చాలా చక్కగా చూపించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.ఇక ఈ సినిమాలో ప్రభాస్,(Prabhas) శృతిహాసన్, పృధ్విరాజ్ వంటి వారితో పాటు మరో నటికి కూడా మంచి గుర్తింపు వచ్చింది.
ఆమె ఎవరో కాదు విశాల్ వదిన నటి శ్రీయా రెడ్డి.ఈమె సలార్ సినిమాలో రాధా రామ( Radharama Role ) అనే పాత్ర పోషించింది.ఇక ఈ సినిమాలో లేడీ విలన్ గా చేసిన శ్రియ రెడ్డి రాధా రామ పాత్ర తనకి మంచి గుర్తింపు తెచ్చిందని ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పింది.

అంతేకాదు ఈ పాత్ర పోషించడం వల్ల నాకు కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి.ఈ సినిమా కారణంగా నేను హాస్పిటల్ పాలయ్యాను అని కూడా చెప్పుకొచ్చింది.ఇక అసలు విషయంలోకి వెళ్తే.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో శ్రియా రెడ్డి (Shriya Reddy) మాట్లాడుతూ.నేను సలార్ సినిమాలో పోషించిన పాత్ర కోసం పెద్దపెద్ద చెవి కమ్మలు పెట్టుకోవాల్సి వచ్చింది.
అలా పెట్టుకున్న క్రమంలో నా చెవులు మొత్తం చీరుకుపోయాయి.

దాంతో సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక హాస్పిటల్ కి వెళ్లి సర్జరీ ( Surgery ) కూడా చేయించుకోవలసి వచ్చింది.అయితే ఈ సినిమాలో ప్రశాంత్ నీల్(Prashanth Neel) అందరినీ డార్క్ కలర్స్ లో చూపించారు.అంతేకాదు వేసుకునే బట్టలు కూడా డార్క్ కలర్స్ లోనే ఉన్నాయి.
అలా ఆలివ్ గ్రీన్, బ్లాక్, గ్రే వంటి కలర్స్ మాత్రమే ఉపయోగించారు.అయితే ఆ సమయంలో నాకు కూడా అలాంటి కలర్ సారీనే ఇచ్చారు.
కానీ నేను కుదరదని ఎల్లో కలర్ సారీ కట్టుకున్నాను.అయితే డైరెక్టర్ వద్దని వారించారు.ఇక ఆ డైరెక్టర్ ఎంత చెప్పినా వినకుండా నేను మాత్రం ఎల్లో కలర్ సారీనే కట్టుకున్నాను అంటూ శ్రియా రెడ్డి చెప్పుకొచ్చింది.ఇక శ్రియా రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా చేస్తున్న ఓజి సినిమాలో( OG Movie ) కూడా ఒక కీలక పాత్రలో చేస్తుందట.