దొంగతనానికి వెళ్లి కూల్ డ్రింక్ తాగి విశ్రాంతి తీసుకుని ఆపై చోరీ..!

కొందరు వ్యక్తులు చేసే పనులు కాస్త విచిత్రంగా ఉండడంతో పాటు చూసే వారందరినీ ఆశ్చర్యపరుస్తాయి.సాధారణంగా దొంగతనానికి( Robbery ) వెళ్లిన వ్యక్తులు ఎంత తొందరగా అయితే అంత తొందరగా దొంగతనం చేసి అక్కడి నుంచి బయటపడతారు.

 Thief Drinks Cool Drink Takes Rest While Robbing Hotels In Kanigiri Details, Thi-TeluguStop.com

కానీ ఓ దొంగ దొంగతనానికి వెళ్లి కూల్ డ్రింక్( Cool Drink ) తాగడంతో పాటు కాసేపు విశ్రాంతి తీసుకుని ఆపై చోరీకి పాల్పడ్డాడు.ఈ ఘటన కనిగిరి పట్టణంలో( Kanigiri ) చోటు చేసుకుంది.

పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్ వద్ద ఉండే నక్షత్ర, మినిర్వా హోటళ్లలో చోరీ జరిగింది.ఈ హోటల్ల యజమాని షేక్ ఖాజా బుధవారం రాత్రి హోటల్లకు( Hotel ) తాళం వేసి ఇంటికి వెళ్ళాడు.గురువారం తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని దొంగ ముందుగా నక్షత్ర హోటల్లోకి( Nakshatra Hotel ) ప్రవేశించి రూ.1.20 లక్షల నగదు చోరీ చేశాడు.ఆ తర్వాత హోటల్లో ఉండే కూల్ డ్రింక్ తాగి కాసేపు అక్కడే విశ్రాంతి తీసుకున్నాడు.అనంతరం మినర్వా హోటల్( Minerva Hotel ) లోపలికి ప్రవేశించి రూ.15 వేలు చోరీ చేసి అక్కడి నుండి పరారయ్యాడు.

దొంగతనానికి పాల్పడిన వ్యక్తి సీసీ టీవీ కెమెరాలను గోడ వైపుకు తిప్పేశాడు.అయిన కూడా దొంగతనానికి పాల్పడిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాలలో కొంతమేర రికార్డు అయ్యాయి.షేక్ ఖాజా హోటల్ తలుపులు తెరవగా చోరీ జరిగిందని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఎస్సై మాధవరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి సీసీటీవీ ఫుటేజ్ ల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube