తిరుమల నడక మార్గంలో ఎలుగుబంటి సంచారం కలకలం

తిరుమల అలిపిరి నడక మార్గంలో ఎలుగుబంటి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.నరసింహస్వామి ఆలయం దగ్గర ఫుట్ పాత్ పై ఎలుగుబంటి కనిపించింది.

 The Tirumala Walking Path Is Full Of Bear Wanderings-TeluguStop.com

ఆలయం దగ్గర రాత్రి ఒంటి గంట సమయంలో ఎలుగుబంటిని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు.చాలాసేపు నడక మార్గంలోనే ఎలుగుబంటి సంచరించినట్లు తెలుస్తోంది.

తిరుమల నడక మార్గంలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచార నేపథ్యంలో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఇటీవల చిరుతలు దాడులు చోటు చేసుకున్న తరుణంలో అటుగా వెళ్లాలంటే జంకుతున్నారు.

జంతువుల సంచారం నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన టీటీడీ, అటవీశాఖ అధికారులు భక్తుల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube