తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.మరికొద్ది రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు.
తనకు ముషీరాబాద్ సీటు ఖరారు అయిందన్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు.పోటీ చేస్తే కొత్తగూడెంలోనే పోటీ చేస్తానని పేర్కొన్నారు.
రాజకీయాల్లోకి ఆస్తులు పోగేసుకోవడానికి, కీర్తి గడించడానికి రావడం లేదని తెలిపారు.ఇంకా ఏడేళ్ల సర్వీస్ ఉన్నా పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని వస్తున్నట్లు వెల్లడించారు.
తనకు కూతురు మాత్రమే ఉందన్న ఆయన తన బాధ్యత కూడా తీరిపోయిందని చెప్పారు.ఇప్పుడు తన కొత్తగూడెం కుటుంబం బాధ్యత మాత్రమే మిగిలి ఉందని తెలిపారు.
ఈ క్రమంలోనే కొత్తగూడెంను బడుగు, బలహీన వర్గాలకు కేటాయించాలని కోరుతున్నట్లు వెల్లడించారు.