సహజంగా హైదరాబాద్ నుంచి జనసేన పార్టీ ఆఫీస్ మంగళగిరి కి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వస్తున్నారంటే అభిమానుల కోలాహలం ఓ రేంజ్ లో ఉంటుంది .గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంపులుగా చేరే అభిమానులు మంగళగిరి ఆఫీస్ వరకు భారీ స్థాయి కవాతులు నిర్వహిస్తూ ఉంటారు.
అయితే గురువారం పార్టీ ఆఫీసుకు వచ్చిన పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి ఏకాంతంగా వివిధ శ్రేణులతో చర్చలు జరిపారన్న వార్తలు గుప్పుమంటున్నాయి….కనీసం మీడియాకు కూడా సమాచారం ఇవ్వకుండా పవన్ జరుపుతున్న ఏకాంత చర్చలు ఏమై ఉంటాయి అంటూ ఆరాలు మొదలయ్యయ్యయి .అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఒక సర్వే సంస్థ తో పవన్ కళ్యాణ్ ఏకాంతంగా భేటీ అయ్యారని జనసేన పార్టీ( Janasena Party ) భవిష్యత్తు, ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న ఆదరణ ని సర్వేల రూపంలో తెలుసుకుంటున్నారని,
ఆ నివేదికల సారాంశాన్ని ఆయా ప్రతినిధులతో డిస్కస్ చేశారని వార్తలు వస్తున్నాయి.అయితే పవన్ ప్రతి రాజకీయ కార్యక్రమం లోనూ క్రమం తప్పకుండా తన పక్కన పెట్టుకునే పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్ ని( Nadendla Manohar ) కూడా ప్రక్కన పెట్టి మరీ పవన్ ఏకాంతం గా ఆ సంస్థ తో బేటీ అవడం ఆసక్తి ని కలిగిస్తుంది .రేస్ అనే సర్వే సంస్థకి ప్రజాభిప్రాయాన్ని సేకరించే బాధ్యతలను అప్పజెప్పారు.వివిధ వర్గాలలో ప్రజాభిప్రాయ సేకరణ చేసిన ఆ సంస్థ తన నివేదికను పవన్ కళ్యాణ్కు సమర్పించినట్లుగా తెలుస్తుది .
తుది నివేదిక ఫలితాలను ఆ సంస్థ ప్రతినిధులతో పవన్ కూలంకషంగా చర్చించారని దాని ఫలితాలు ఆధారంగానే తన భవిష్యత్తు కార్యాచరణను నిర్మించుకునే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలుస్తుంది ఏదిఏమైనా రాజకీయాల్లో ఒక్కసారిగా సీరియస్ మోడ్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తన తదుపరి రాజకీయ ప్రయాణాన్ని వేగవంత చేయనున్నట్లు తెలుస్తుంది….ఎన్నికలకు కూడా తక్కువ సమయం ఉన్నందున పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని అందువల్ల తొందర్లోనే తన కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలను కూడా పూర్తి చూసుకోవాలనే తొందర్లో ఆయన ఉన్నట్లుగా తెలుస్తుంది.