ప్రకాశం జిల్లాలో మహిళ దారుణ హత్యకు గురైంది.వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు క్రాస్ రోడ్డు వద్ద మహిళను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చంపారు.
ఈ క్రమంలో మృతురాలు కోట రాధగా గుర్తించారు.నిన్న సాయంత్రం కనిగిరి వెళ్తున్నానని చెప్పిన రాధ తిరిగి రాలేదు.
దీంతో రాధ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మృతదేహాన్ని గుర్తించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.