పాండవులు ఒక సంవత్సర కాలం పాటు విరాట రాజు రాజ్య భవనంలో పని వాళ్లుగా చేరిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే.అయితే వీరి భార్య ద్రౌపది.
విరాట రాజు భార్య అయిన సుధేష్ణకు మహిళా సేవకురాలిగా పని చేసేది.ఈమె పేరు మాలినిగా అక్కడి వారికి తెలుసు.
అయితే అక్కడ పనిచేస్తుండగానే సుధేష్ణ తమ్ముడు.విరాట రాజు బావ మరిది అయిన కీచకుడు మాలిని రూపంలో ఉన్న ద్రౌపదిపై మనసు పడతాడు.
తన మనసులోని విషయాన్ని తన అక్క సుధేష్ణకి చెబుతాడు.
తనకు మధువు పోసేందుకు మాలినిని తన గదికి పంపమని చెబుతాడు.
అందుకు ఒప్పుకున్న సుధేష్ణ.మాలిని రూపంలో ఉన్న ద్రౌపదిని కీచకుడి గదికి పంపుతుంది.
అక్కడే కీచకుడు ద్రౌపదిని కౌగిలించుకునే ప్రయత్నం చేస్తాడు.అందుకు ఒప్పుకోని ఆమె.కీచకుడిని గట్టిగా తోసేస్తుంది.ఆ గదిలోంచి వేరే గదిలోకి పరిగెడుతుంది.
ఆమె వెంటే కీచకుడు పరిగెడ్తూ.ఆమెను అత్యాచారం చేయాలని చూస్తాడు.
ద్రౌపది భర్త అయిన యుధిష్టరుడు, కీచకుడి కుటుంబ సభ్యులందరి ముందు కింద పడేసి తన్నుతాడు.కానీ అతడిని ఎవ్వరూ ఏమనరు.ఈ ఘటన తర్వాత ద్రౌపది వంట వాడిగా ఉన్న భీముడితో కలిసి కీచకుడిని చంపేందుకు ప్రణాళిక రూపొందిస్తుంది.ఆ తర్వాత ద్రౌపది స్థానంలో భీముడు పడుకొని ఉంటాడు.
మద్యం మత్తులో కీచకుడు.నర్తన శాలలో ఉన్నది ద్రౌపదే అనుకొని అత్యాచారం చేయబోగా… భీముడు కీచకుడిని చంపేస్తాడు.