యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR ) టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ ( Koratala Shiva ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ”NTR30”.మరి ఈ పాన్ ఇండియన్ సినిమా నుండి ఏదొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వస్తూనే ఉంది.తాజాగా మరో అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.
ఫస్ట్ షెడ్యూల్ జరుపు కుంటున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ గురించి ఒక సమాచారం బయటకు వచ్చింది.కాగా నెక్స్ట్ షెడ్యూల్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ (NTR30 Update) వైరల్ అవుతుంది.
అందుతున్న సమాచారం ప్రకారం నెక్స్ట్ షెడ్యూల్ లో కొరటాల శివ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేస్తున్నారట.ఇందులో ఎన్టీఆర్ కు విలన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan ) కన్ఫర్మ్ అయిన విషయం తెలిసిందే.
మరి ఎన్టీఆర్ – సైఫ్ అలీ ఖాన్ మధ్య భారీ యాక్షన్ ఎపిసోడ్ జరగబోతుందట.ఈ షెడ్యూల్ వచ్చే నెల రెండవ వారం నుండి స్టార్ట్ అవుతుందట.అంతేకాదు ఈ షెడ్యూల్ వైజాగ్ బీచ్ లో జరగనుండగా.ఈ సముద్రపు విజువల్స్ ను డ్రోన్ షాట్ లో షూట్ చేయనున్నారని తెలుస్తుంది.అందరికన్నా చెడ్డ వాడు అన్యాయాన్ని ఎలా అంతం చేసాడు అనే కోణంలో కొరటాల కథను రాసుకున్నట్టు సమాచారం.
మొత్తానికి వీరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాను మించి ఈ సినిమాను కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.అందులోను ఇది పాన్ ఇండియన్ కావడంతో మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా కూడా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) నటిస్తుంది.
కాగా ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.అలాగే 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అని ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.