రామ్ చరణ్ కి ఎన్టీయార్ కి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా..?

నందమూరి వంశం నుంచి వచ్చిన హీరోల్లో ఎన్టీయార్ ( NTR ) ఒకరు ఆయన చేసిన సినిమాలు చాలా వరకు మంచి విజయాలను అందుకున్నాయి.అందులో భాగం గానే ఆయన ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీయార్ 30( NTR30 ) పేరు తో ఒక సినిమా చేస్తున్నారు… ఆర్ఆర్ఆర్ వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత చేస్తున్న చిత్రం కావడంతో మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి .

 Is There A Cold War Between Ram Charan And Ntr Details, Ntr ,ram Charan, Ntr Din-TeluguStop.com

ఇక తాజాగా ఎన్టీఆర్ తన నివాసంలో గ్రాండ్ పార్టీ ఇచ్చారు .ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన ఈ డిన్నర్ నైట్ కి రాజమౌళి, కొరటాల శివ, మైత్రీ మూవీస్ కి చెందిన నవీన్ యెర్నేని, రవి శంకర్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ జేమ్స్ ఫెర్రెల్ కూడా ఈ పార్టీలో జాయిన్ అయ్యారు.

తన నివాసంలో జరిగిన ఈ పార్టీ గురించి ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు.

 Is There A Cold War Between Ram Charan And NTR Details, Ntr ,ram Charan, Ntr Din-TeluguStop.com

శ్రేయోభిలాషులు, సన్నిహితులతో గడిపిన ఈ క్షణాలు అద్భుతం అంటూ ఎన్టీఆర్ తన ఆనందం పంచుకున్నారు.ఇక ఎన్టీఆర్ సడన్ గా ఈ ఈవెంట్ ఏర్పాటు చేయడం వెనుక కారణాలపై చర్చ సాగుతుంది .అమెజాన్ స్టూడియోస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫెర్రెల్ హాజరు కావడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.ఆర్ఆర్ఆర్ ఆస్కార్ గెలిచిన నేపథ్యంలో రామ్ చరణ్ తన బర్త్ డే గ్రాండ్ గా జరుపుకున్నారు.

ఆస్కార్ విజయాన్ని, పుట్టినరోజును కలిపి తన నివాసంలో భారీ విందు ఏర్పాటు చేశారు.

Telugu Chandra Bose, Chiranjeevi, Keeravani, Koratala Siva, Ntr, Ntr Ram Charan,

దాదాపు టాలీవుడ్ మొత్తం ఈ పార్టీకి హాజరయ్యారు.ఎన్టీఆర్ మాత్రం రాలేదు.రామ్ చరణ్( Ram Charan ) మిత్రుడు ఆర్ఆర్ఆర్ కో స్టార్ అయిన ఎన్టీఆర్ హైదరాబాద్ లో ఉండి కూడా డుమ్మా కొట్టడం చర్చకు దారితీసింది…ఇక ఎన్టీఆర్ నివాసంలో జరిగిన పార్టీకి రామ్ చరణ్ రాలేదు.

అయితే ఆయన రాకపోవడానికి కారణం ఉంది.రామ్ చరణ్ ఇండియాలో లేరు.దుబాయ్ లో భార్య ఉపాసనతో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు.ఇక ఆర్ఆర్ఆర్ క్రెడిట్ ఎవరికి ఎక్కువ దక్కిందనే విషయంలో రామ్ చరణ్-ఎన్టీఆర్ ల మధ్య మనస్పర్థలకు దారితీసిందనే వాదన కూడా ఉంది.

Telugu Chandra Bose, Chiranjeevi, Keeravani, Koratala Siva, Ntr, Ntr Ram Charan,

అలాగే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ వేడుక పేరుతో టాలీవుడ్ పెద్దలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.కీరవాణి, చంద్రబోస్ లను సత్కరించారు.ఈ వేడుకకి చిరంజీవి హాజరు కాలేదు.ఆర్ ఆర్ ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ సైతం ఈవెంట్ కి దూరంగా ఉన్నారు.ఆర్ ఆర్ ఆర్ నిర్మాత డివివి దానయ్య లేకుండా సన్మాన కార్యక్రమమా అని నిర్మాత నట్టి కుమార్ విమర్శించారు.ఇక ఇప్పుడు ఎన్టీఆర్ విందుకు చరణ్ రాకపోవడంపై కూడా చర్చకు సాగుతున్నాయి .అయితే దానికి రీజన్ ఉండటంతో దీనిపై విమర్శలు రాకపోవచ్చు.ఇక ఇది ఇలా ఉంటే వీళ్లిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది అని మరి కొందరు అంటున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube