మహేశ్వరంలో తహసీల్దార్ భూ దందా..!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రిజిస్ట్రేషన్ల కోసం ధరణి పోర్టల్ ను తీసుకొచ్చినా భూ సమస్యలు మాత్రం తీరడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో భూ దందా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

 Tehsildar Bhu Danda In Maheswaram..!-TeluguStop.com

మహేశ్వరంలో తహసీల్దార్ నిషేధిత జాబితాలోని రూ.200 కోట్లు విలువ చేసే భూమికి కన్నం వేశారని తెలుస్తోంది.రాజధాని శివారు ప్రాంతమే కాకుండా త్వరలోనే ప్రారంభం కానున్న ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఫార్మాసిటీకి సమీపంలో ఈ భూదందా తెరపైకి వచ్చింది.నాగారం గ్రామంలోని సర్వే నంబర్ 181లో మొత్తం 101 ఎకరాల భూమిలో 52 ఎకరాలు గైయిరాన్ భూమి కాగా మిగతాది భూదాన్ ల్యాండ్ గా గుర్తించారు.

అయితే అహ్మద్ జబర్దస్ట్ ఖాన్ పేరు మీద భూమి ఉందని ఆయన కుమారుడు వాదన కొనసాగుతుండగా ఎమ్మార్వో మాత్రం పట్టా భూములని రిపోర్ట్ ఇచ్చారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో తహశీల్దార్ భూ దందాపై ఈడీ, సీబీఐకు ఫిర్యాదు అందడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube