టాలీవుడ్ యంగ్ హీరోల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఒకరు.ఈయన చాలా కస్టపడి పైకి వచ్చాడు.
ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇప్పుడు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.పెళ్లి చూపులు సినిమాతో తొలి హిట్ అందుకున్న విజయ్ ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.
ఈ సినిమా తర్వాత వరుస ప్లాప్స్ వస్తున్నా కూడా ఈయనపై అభిమానం ఏమాత్రం తగ్గడం లేదు.ఇటీవలే ఎన్నో అంచనాల మధ్య పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయిన లైగర్ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.
ఈ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది.అయినా కూడా నైజాం నుండి స్టార్ హీరోగా నిలిచాడు.ఇదిలా ఉండగా తాజాగా విజయ్ దేవరకొండ అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు.
ఈ క్రమంలోనే ”ఒక్క హిట్టు అన్నా! అంటూ అభిమానులు అతడిని కోరడంతో దీనికి విజయ్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.”ఒకటే పెండింగ్ రా.హిట్టడం” అంటూ ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పారు.ఈయన వ్యాఖ్యలకు ఫ్యాన్స్ నుండి మంచి స్పందన లభిస్తుంది.మేం ‘ఖుషీ‘తో చేస్తాం అని కామెంట్స్ చేయగా విజయ్ నవ్వుతు అభిమానులను సంతోష పరిచాడు.
ఇక ప్రెజెంట్ విజయ్ చేస్తున్న సినిమా ‘ఖుషీ’.ఈ సినిమాను శివ నిర్వాణ డైరెక్టర్ చేస్తున్నాడు.సమంత, విజయ్ కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది.ఇప్పటికే ఈ సినిమా సగానికి పైగానే షూట్ పూర్తి చేసుకుంది.గత కొన్ని రోజులుగా షూట్ వాయిదా పడగా త్వరలోనే స్టార్ట్ కానుంది.మరి ఈ సినిమాతో అభిమానులు కోరుకున్న హిట్ అందుకుంటాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.