జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆవేశపూరితంగా ప్రసంగించడం తెలిసిందే.ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపాయి.
అధికార పార్టీ వైసీపీ నాయకులను ఉద్దేశించి పరుష పదజాలంతో పవన్ కామెంట్లు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి.ఇక ఇదే సమయంలో తన మూడు పెళ్లిళ్లు గురించి పవన్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
తనకి కుదరక మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు.మీరు కూడా చేసుకోవాలనుకుంటే బరణం ఇచ్చి చేసుకోండి అంటూ మండిపడ్డారు.,/br>
అయితే పవన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది.ఇష్టం ఉన్నవాళ్లు మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చని పవన్ కామెంట్ లపై మండిపడింది.అంతేకాకుండా పవన్ తాను చేసిన కామెంట్లను ఉపసంహరించుకుని మహిళలకు క్షమాపణలు చెప్పాలని ఆయనకు నోటీసులు పంపించడం జరిగింది.భరణం ఇచ్చి ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చని పవన్ అనడం బాధించిందని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.
మరి ఈ నోటీసుల పై జనసేన ఏ విదంగా స్పందిస్తుందో చూడాలి.