1.ఢిల్లీ కి బండి సంజయ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేడు ఢిల్లీకి వెళ్లారు.
2.రేవంత్ పరిధి మేరకే పనిచేస్తున్నారు : జీవన్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు జీవన్ రెడ్డి పరిధి మేరకే పనిచేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు.
3.ఓయూ పూర్వ విద్యార్థులకు బయోటెక్ గ్రాంట్
మిర్చి, మామిడి పంటలను నాశనం చేస్తున్న నల్లపురుగు తెగులు నివారణకు పరిష్కారం చూపించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు రూపొందించిన బయో టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్రతిష్టాత్మక గ్రాంట్ స్కీమ్ కు ఎంపికయ్యింది.
4.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 19,406 నా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
5.కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు కేటీఆర్ లేఖ
కేంద్రమంత్రి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.టెక్స్ట్ టైల్, చేనేత రంగాలపై కేంద్రం నిరాశక్తితో చూపుతోందని తప్పుపట్టారు.మోదీ సర్కార్ నేతన్నల కడుపు కొడుతోందని లేఖలో విమర్శలు చేశారు.
6.రేవంత్ రెడ్డి పై కోమటిరెడ్డి బ్రదర్స్ విమర్శలు
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు.
7.ఓపెన్ స్కూల్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఓపెన్ స్కూల్ లో చదివే అభ్యర్థులకు పెంచిన పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ ను ప్రకటించారు.ఈ ఓపెన్ స్కూల్ లో టెన్త్ , ఇంటర్ చదివేవారు సెప్టెంబరు అక్టోబరు లో రాసే పరీక్షల కోసం ఈ నెల 11 నుంచి 22 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
8.సాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రకటించిన ఆర్మీ
ఉపయోగిస్తున్న ఉపగ్రహ ఆధారిత సమాచార వ్యవస్థ అత్యవసర పరిస్థితుల్లో ఎలా పనిచేస్తుందని విషయాన్ని తెలుసుకునేందుకు ఆర్మీ ఇటీవల శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థను పరీక్షించింది.ఈ కార్యక్రమానికి ‘ స్కై లైట్ ‘ అని పేరు పెట్టింది.
9.బాధితుల ఖాతాల్లో 10 వేలు జమ
నదిలో ఇటీవల సంబంధించిన వరదలు వల్ల భద్రాద్రి జిల్లాలో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం విపత్తు సాయం కింద పదివేలు చొప్పున వారి వారి ఖాతాల్లో జమ చేసింది.
10.పీజీ ఈసెట్ 84 శాతం హాజరు
పీజీ ఈ సెట్ కు 84.39 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.
11.ఎంపీ గోరంట్ల క్షమాపణ చెప్పాలి: కమ్మ సంఘం
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కమ్మ కులాన్ని దూషించడం ను నిరసిస్తూ సంఘం నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతపురం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు.
12.ఎంపీ గోరంట్ల దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్న పోలీసులు
గుంతకల్లు పొట్టి శ్రీరాములు కూడలి లో ఎంపీ గోరంట్ల మాధవ్ దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
13.కొత్త ఓటర్లు గా నమోదు చేసుకోండి
కొత్తగా ఓటర్లు గా నమోదు కు అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించింది.ఈ మేరకు ఏపీలో ప్రత్యేక సవరణ ప్రారంభం అయినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.
14.రేపు ఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష
రేపు తెలంగాణ లో పోలీసు ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది.
15.ఢిల్లీకి దాసోజు శ్రవణ్
కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఏ ఐ సీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ నేడు బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి ఢిల్లీకి వెళ్లారు.
16.మంకీ ఫాక్స్ కలకలం
విశాఖలో ఓ వ్యక్తికి మంకీ ఫాక్స్ లక్షణాలు కనిపించాయి.అయితే అతడు ఆసుపత్రి నుంచి పరారీ కావడం కలకలం రేపుతోంది.
17.ఏపీలో నేటి నుంచి 21 వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి.
18.శ్రీకాకుళం జిల్లాలో నేడు జగన్ పర్యటన
ఏపీ సీఎం జగన్ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.
19.నేడు ఢిల్లీకి చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారు.అజాది కా అమృత్ మహోత్సవ్ లో నేషనల్ కమిటీ భేటీలో చంద్రబాబు పాల్గొన్నారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,250 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 51,550
.