మాస్ మహా రాజా కరోనా తర్వాత ఫుల్ జోష్ గా మారిపోయాడు.ఆయన ప్రస్తుతం ఐదారు సినిమాలతో బిజీగా ఉన్నాడు.
రెమ్యునరేషన్ పెంచిన కూడా రవితేజ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు.క్రాక్ కిరాక్ హిట్ అవ్వడంతో ఈయన హిట్ లిష్టులోకి చేరిపోయాడు.
అయితే ఈయన చేస్తున్న సినిమాలు క్రాక్ తర్వాత రెండు రిలీజ్ అయినా అంతగా ఆకట్టుకోలేక పోయాడు.
ఖిలాడీ దెబ్బతో రామారావు ఆన్ డ్యూటీ బిజినెస్ లెక్కలు మారిపోయాయి.
ఇలా రెండు సినిమాలు రిలీజ్ అయితే రెండు కూడా ప్లాప్ అయ్యాయి.రామారావు డ్యూటీ అయితే మరింత నిరుత్సాహ పరిచింది.
ఇక ఈయన చేస్తున్న సినిమాల్లో టైగర్ నాగేశ్వరరావు ఒకటి.వంశీ కృష్ణ దర్శకత్వంలో స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తెరకెక్కుతుంది.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నారని ఇప్పటికే వారలు వచ్చాయి.ఈ వార్తలను నిజం చేస్తూ తాజాగా మేకర్స్ ఈ సినిమా నుండి ఒక అఫిషియల్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు భాగం అయినట్టు పోస్టర్ ద్వారా తెలిపారు.
ఆయన ఎవరో కాదు.
బాలీవుడ్ లెజెండరీ నటుడు కాశ్మీర్ ఫైల్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో భాగం అయినట్టు పోస్టర్ రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ ఫస్ట్ లుక్ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో బాగా ఆకట్టు కుంటుంది.1970 స్టువర్ట్ పురంలో పేరుమోసిన గజదొంగ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.

పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది కాబట్టి అన్ని ఇండస్ట్రీల నుండి నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు.ఇక ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ తన బ్యానర్ అయిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పై నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించ నున్నారు.
ఇక ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్ లుగా నటిస్తుండగా రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తుంది.