భారత సంతతి నటుడు , ప్రముఖ కమెడియన్ పాల్ చౌదరిపై లండన్లో గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు.సెంట్రల్ లండన్లో తన కారులో వుండగానే తనపై దాడి జరిగిందని చౌదరి తెలిపారు.
మిర్రర్.కో.యూకే కథనం ప్రకారం.పంజాబీ సంతతికి చెందిన 47 ఏళ్ల పాల్ చౌదరిపై దుండగులు దాడి చేయడాన్ని తాము చూశామని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
శుక్రవారం ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.
పాల్ చౌదరి అసలు పేరు.
తాజ్పాల్ సింగ్ చౌదరి.ఈ సంఘటన జరిగినప్పుడు తాను లండన్ లోని న్యూ ఆక్స్ఫర్డ్ స్ట్రీట్లో వున్నానని ఆయన తెలిపారు.
పాల్ చౌదరిపై దాడి జరిగిందని తెలుసుకున్న అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇది తనపై జరిగిన తొలి ఘటన కాదని.1980లలో తన తండ్రి ఎదుర్కొన్న వివక్షను, పక్షపాతాన్ని పాల్ చౌదరి పంచుకున్నారు.ఆ సమయంలో తన తండ్రి కత్తి పోటుకు గురయ్యారని తెలిపారు.
కానీ ఇది మానవ స్వభావంలో ఒక భాగమని అందరికీ తెలుసునని, అయితే తన జీవితంలో మాత్రం చీకటి కోణమని పాల్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకపోతే.పాల్ తన కెరీర్ను 1998లో ప్రారంభించారు.‘‘స్టాండ్ అప్ ఫర్ ది వీక్’’ అనే కామెడీ సిరీస్ను హోస్ట్ చేశారు.2003లో ట్రినిడాడ్లో జరిగిన కరేబియన్ కామెడీ ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చిన తొలి బ్రిటీష్ వ్యక్తిగా పాల్ చౌదరి రికార్డుల్లోకెక్కారు.2017లో ఆయన ‘‘ ది రస్సెల్ హోవార్డ్ అవర్’’లో గెస్ట్ స్టాండప్ పర్ఫార్మర్ గా వ్యవహరించారు.2020లో టెలివిజన్ డ్రామా సిరీస్ ‘‘డెవిల్స్’’లో కనిపించారు.