200 ఎకరాల్లో పుచ్చసాగుతో కోటీశ్వరులైన 700 మంది మహిళలు

హిమాచల్ ప్రదేశ్‌లోని చర్హిలో నివసిస్తున్న మహిళా రైతులు అద్భుతాలను చేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు.ఇక్కడి మహిళలు కమ్యూనిటీ ఫార్మింగ్ వైపు అడుగులు వేశారు.

 Watermelon Farming Profit 700 Women Farmers, Watermelon,watermelon Farming Techn-TeluguStop.com

దాదాపు 700 మంది మహిళా రైతులు 200 ఎకరాల్లో పుచ్చకాయ సాగు చేస్తూ లక్షల్లో లాభాలు అందుకుంటున్నారు.ఈ మహిళా రైతులందరికీ కమతాలుగా భూమి ఉంది.

ఈ భూములలో తక్కువ పరిమాణంలో వ్యవసాయం జరిగేది.వ్యవసాయం అంతా వర్షంపైనే ఆధారపడేది.

అటువంటి పరిస్థితిలో ఈ మహిళలు ఒక సమూహంగా ఏర్పడి వారి స్వంత భూములను కలపడం ద్వారా వ్యవసాయం కోసం విశాలమైన భూమిని సిద్ధం చేసి సామూహికంగా వ్యవసాయం చేయడం ప్రారంభించారు.దీంతో వారి లాభాలు అనూహ్యంగా పెరిగాయి.

హజారీబాగ్ చుట్టుపక్కల జిల్లాల్లో పుచ్చకాయకు ఉన్న డిమాండ్ దృష్ట్యా పుచ్చకాయ సాగు చేయాలని ఆ మహిళలు నిర్ణయించుకున్నారు.వీటినే ముందుగా సాగుచేయాలని సంకల్పించారు.

కరోనా కారణంగా లాక్‌డౌన్ ఉన్నప్పటికీ, వారికి మంచి లాభాలు వచ్చాయి.ఆ తర్వాత ఈ మహిళలంతా పెద్ద ఎత్తున పుచ్చకాయ సాగు ప్రారంభించారు.

ఇప్పుడు ఈ పుచ్చకాయలను హజారీబాగ్‌తో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా పంపుతున్నారు.ఈ మహిళా రైతులకు వ్యవసాయం ద్వారా ఏడాదికి 20 నుండి 30 వేల వరకు వచ్చే చోట, నేడు వారి ఆదాయం గతంలో కన్నా4 నుండి 5 రెట్లు పెరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube