ప్రతిష్టాత్మక యు.వి.క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా ప్రశాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ దర్శక నిర్మాతలు విడుదల చేశారు.
తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మధు శ్రీనివాస్ మాటలు అందిస్తున్న ఈ సినిమాకు.
సత్య జి ఎడిటర్.ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.
నటీనటులు:
కార్తికేయ, ఐశ్వర్య మీనన్, తనికెళ్ళ భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ
సాంకేతిక నిపుణులు
దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి, నిర్మాణ సంస్థ: యు.వి.క్రియేషన్స్, మాటలు: మధు శ్రీనివాస్, ఆర్ట్: గాంధీ నడికుడికర్, ఎడిటర్: సత్య జి, సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్, పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్.