నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో భారీ ఎత్తున మహిళలకు ఆడపడుచులకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఎక్కడ స్త్రీ గౌరవించ బడుతుందో.
అక్కడ సకల సౌభాగ్యాలు కలుగుతాయని కొటేషన్ లు పెడుతున్నారు.ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి సీఎం జగన్ సోషల్ మీడియాలో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
మనది మహిళా పక్షపాత ప్రభుత్వమని చెప్పడానికి ఈ 34 నెలల్లో వారి కోసం ఖర్చు పెట్టిన 1.18 లక్షల కోట్ల మొత్తమే సాక్ష్యం.వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు రాజకీయ నియామకాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశాం.మహిళలకు ఇంకా మంచి చేయడానికి కృషి చేస్తూనే ఉంటామని చెబుతూ చిన్నారులకు, అక్క చెల్లెమ్మలకు, అవ్వలకు, మహిళా లోకాని కంతటికీ హృదయ పూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెట్టారు.
ఇదిలా ఉంటే సీఎం జగన్ రాజకీయ జీవితంలో ముగ్గురు మహిళలు కీలక పాత్ర పోషించారని వైయస్ విజయమ్మ, షర్మిల, వైయస్ భారతీ .ఈ ముగ్గురు మహిళలపై వైసీపీ క్యాడర్ పొగడ్తల వర్షం కురిపిస్తోంది.