ఈతరం స్టార్ హీరోలలో మహేష్ బాబు, అల్లు అర్జున్ వరుస యాడ్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.సినిమాల ద్వారా సంపాదిస్తున్న మొత్తానికి సమానంగా ఈ స్టార్ హీరోలు యాడ్స్ తో సంపాదిస్తున్నారు.
అయితే సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన చిరంజీవి చాలా సంవత్సరాల క్రితం ఎక్కువ సంఖ్యలో యాడ్స్ లో నటించారు.పలు కూల్ డ్రింక్ కంపెనీల యాడ్స్ లో కనిపించడం ద్వారా చిరంజీవి పాపులారిటీని సంపాదించుకున్నారు.
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి యాడ్స్ కు కూడా దూరమయ్యారనే సంగతి తెలిసిందే.రీఎంట్రీలో వరుస విజయాలను అందుకుంటున్న చిరంజీవి 13 సంవత్సరాల తర్వాత ఒక యాడ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బోగట్టా.
రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన యాడ్ లో చిరంజీవి కనిపించనున్నారని సమాచారం అందుతోంది.ఈ యాడ్ కోసం చిరంజీవి 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.
చిరంజీవి యాడ్స్ లో నటిస్తే ఆ యాడ్స్ ద్వారా ఆయా కంపెనీలకు ప్లస్ అయింది.
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థతో చిరంజీవి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని త్వరలో అందుకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయని తెలుస్తోంది.మరోవైపు స్టార్ హీరో చిరంజీవి వరుస మూవీ ఆఫర్లతో బిజీగా ఉన్నారు.ఆయన నటించిన ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.2022 సంవత్సరంలోనే ఈ సినిమాలు విడుదల కానున్నాయి.రాబోయే నాలుగేళ్లలో కనీసం పది సినిమాలు చేయాలని మెగాస్టార్ చిరంజీవి భావిస్తున్నారు.చిరంజీవి నటిస్తున్న యాడ్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మెగాస్టార్ కు మరిన్ని ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంది.
చిరంజీవికి యూత్ లో భారీస్థాయిలో క్రేజ్ ఉండగా సినిమాసినిమాకు మెగాస్టార్ కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.