మంత్రి కొడాలి నాని నిర్వహించిన జూద క్రీడలు బయట పడతాయన్న భయంతోనే టిడిపి నిజనిర్ధారణ కమిటీని అడ్డుకునేందుకు, వైసిపి నాయకులు ప్రయత్నిస్తున్నారు.అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఎటువంటి సమావేశాలు పేట్టని మంత్రి నాని, నేడు కే కన్వెన్షన్ లో ఎస్సీ సెల్ సమావేశం నిర్వహించడం , అతని భయాన్ని తెలియజేస్తుంది.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.టీడీపీలో క్రమశిక్షణతో ఉన్న మంత్రి కొడాలి నాని, వైసీపీలోకి వెళ్లిన తర్వాతె బూతుల మంత్రి,పేకాట మంత్రిగా పేరు గడించారు.
ఆదిలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు.ప్రస్తుతం క్యాసినో మంత్రిగా పేరు గడించిన నాని అరాచకం భవిష్యత్తులో ఏ స్థాయికి చేరుకుంటుందో.