సమంత,ఈ ఏడాది ఎన్నో సంచలనాలకు వేదికగా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాల విషయంలోనూ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది.
తొలుత ఈమె సినిమాల గురించి మాట్లాడుకుందాం.ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో జనాలను బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ ప్రాజెక్టుతోనే ఆమె ఓటీటీలోకి అడుగు పెట్టింది.ఈ సిరీస్ లో రాజీగా తను అదరగొట్టింది.
నేషనల్ వైడ్ గా సమంత మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ నుంచి ఆఫర్లు బాగా వస్తున్నాయి.
తాజాగా చేసిన సర్వేలో.ఓటీటీలో మోస్ట్ పాపులర్ యాక్టర్స్ లిస్టులో సమంత నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.
తాజాగా దేశంలోనే మోస్ట్ పాపులర్ ఓటీటీ యాక్టర్స్ లిస్ట్ ను ఒర్మాక్స్ మీడియా బయట పెట్టింది.సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు గాను విడుదల చేసిన ఈ లిస్ట్ లో సమంత టాప్ 4 లో స్థానం పొందింది.
ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో మెప్పించిన మనోజ్ బాజ్ పాయ్ ఈ లిస్టులో తొలి ప్లేస్ లో నిలిచాడు.రెండో స్థానంలో మనోజ్ త్రిపాఠి, మూడో స్థానంలో నవాజుద్దీన్ సిద్ధిఖి ఉన్నారు.
సమంత నాలుగో స్థానంలో నిలవగా.రాధిక ఆప్టే, కెకె మీనన్, సైఫ్ ఆలీఖాన్, సుస్మితా సేన్, జితేంద్ర కుమార్ , తమన్నా ఆ తర్వాత వరుస స్థానాలు దక్కించుకున్నారు.
అటు ది ఫ్యామిలీ మ్యాన్-2లో సమంత చేసిన రాజీ పాత్రకు గాను ఉత్తమ నటిగా ఓటీటీ ఫిల్మ్ ఫేర్ అవార్డును దక్కించుకుంది.తాజాగా ఓటీటీలో మోస్ట్ పాపులర్ యాక్టర్స్ లిస్ట్ లో నాలుగో స్థానం దక్కించుకుంది.
కేవలం ఒకే ఒక్క వెబ్ సిరీస్ తో మంచి పాపులారిటీ దక్కించుకుంది.అటు తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకుంది సమంత.ప్రేమ పెళ్లి చేసుకున్న సమంత, నాగ చైతన్య వ్యక్తిగత విభేదాల కారణంగా విడిపోతున్నట్లు ప్రకటించారు.ఈ వార్త టాలీవుడ్ లో సంచలనం కలిగించింది.