పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కామెంట్స్… తెలంగాణ లో విద్యా వ్యవస్థ విషయంలో ప్రభుత్వం నిద్ర పోతుంది.గత రెండేళ్ల కింద విద్యార్థులు బోర్డు తీరు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.4.50 లక్షల మంది పరీక్ష రాస్తే.2.35 లక్షల మంది ఫెయిల్ అయ్యారు.చాలా రాష్ట్రాలలో కోవిడ్ కారణంగా పాస్ చేశారు.తెలంగాణ లో విద్యార్థులు చనిపోతున్న ఎందుకు పాస్ చేయడం లేదు.
ఫెయిల్ అయిన విద్యార్థులంతా ప్రభుత్వ కాలేజ్ విద్యార్థులే.కోవిడ్ కారణంగా ఆన్ లైన్ క్లాస్ లు లేవు.
ప్రభుత్వ కాలేజ్ విద్యార్థులకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించలేదు.ప్రైవేట్ కాలేజ్ లలో ఆన్ లైన్ క్లాస్ లు జరిగాయి.
పాస్ అయ్యారు.ఎలాంటి సదుపాయాలు ఇవ్వకుండా ఫెయిల్ అయిన విద్యార్థులను పట్టించుకకపోతే ఎట్లా.
విద్యార్థుల విషయంలో ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోంది.దీని వల్ల ప్రతీ రోజు పిల్లలు చనిపోతున్నారు.
ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటే వారికే మంచిది.ఆలస్యం అయితే ఉపయోగం ఉండదు.