సడెన్ గా కోలీవుడ్ స్టార్ హీరోలంతా టాలీవుడ్ మీద కాన్సెంట్రేట్ చేసిన విషయం తెలిసిందే.ధనుష్, విజయ్ ఇలా అక్కడ క్రేజీ హీరోలందరు తెలుగు దర్శకులతో సినిమాలు కమిట్ అయ్యారు.
వారిలో ముఖ్యంగా ధనుష్ వరుసగా తెలుగు సినిమాలు ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.ఆల్రెడీ శేఖర్ కమ్ముల డైరక్షన్ లో ధనుష్ హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒక సినిమా ఎనౌన్స్ మెంట్ జరిగింది.
అయితే ఈ సినిమాతో పాటుగా సితార బ్యానర్ లో కూడా ధనుష్ సినిమా ఉంటుందని చెబుతున్నారు.
ఇక ఈ రెండు ప్రాజెక్టులు మాత్రమే కాదు మైత్రి మూవీ మేకర్స్, ఆర్.ఆర్.ఆర్ నిర్మాత డివివి దానయ్యతో కూడా ధనుష్ సినిమా డిస్కషన్స్ జరుపుతున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.మొత్తం తెలుగులో స్ట్రైట్ గా ధనుష్ నాలుగు సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది.ధనుష్ చేస్తున్న ఈ సినిమాలతో అతనికి తెలుగులో ఉన్న క్రేజ్ డబుల్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు.
అయితే ఈ నాలుగు సినిమాల్లో డైరక్టర్ గా శేఖర్ కమ్ముల ఒక్కడే కన్ఫర్మ్ కాగా మిగతా దర్శకులు ఎవరన్నది తెలియాల్సి ఉంది. కోలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్న ధనుష్ తెలుగులో కూడా ఇక మీదట వరుస సినిమాలు చేస్తాడని టాక్.