దక్షిణాది రాష్ట్రాలలో ఎన్నో సినిమాలలో నటించి విశేష ఆదరణ దక్కించుకున్న నటీమణులలో హీరోయిన్ ప్రియమణి ఒకరు.ఎన్నో సినిమాలలో నటించిన ఈమె తాను ప్రేమించినటువంటి ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని 2017వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.
వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ప్రియమణి బుల్లితెరపై పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.ఈ క్రమంలోనే “ది ఫ్యామిలీ మెన్” అనే వెబ్ సిరీస్ లో నటించారు.
తాజాగా వెంకటేష్ నటించినటువంటి “నారప్ప” చిత్రంలో కూడా కీలక పాత్రలో నటించి సందడి చేశారు.ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ, బుల్లితెరపై సందడి చేస్తూ ఎంతో బిజీగా ఉన్న ప్రియమని వైవాహిక జీవితంలో పలు గొడవలు తలెత్తాయి.
ప్రియమణి పెళ్లి చెల్లదంటూ తన భర్త మొదటి భార్య అయేషా గత కొద్ది రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే.ముస్తఫా తనకు విడాకులు ఇవ్వకుండా ప్రియమణిని పెళ్లి చేసుకున్నాడని, ఈ క్రమంలోనే చట్టపరంగా ఈ వివాహం చెల్లదని అయేషా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయంపై స్పందించిన ప్రియమణి తన వైవాహిక జీవితానికి ఏ విధమైనటువంటి డోకా లేదని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా నిత్యం సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా ఉండే ప్రియమని తాజాగా సాంప్రదాయ దుస్తులను ధరించి ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.నారింజ రంగు లెహంగా ధరించి, అందుకు సరిపడా నగలతో ఎంతో అందంగా ఉన్నటువంటి ప్రియమణి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.