టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాలలో నటించిన ఆయన స్టార్ హీరోగా నిలిచాడు.
ఇక రాజకీయ పరంగా కూడా పవన్ పలు బాధ్యతలు తీసుకున్నాడు.ఓవైపు సినిమాలలో , మరోవైపు రాజకీయంలో బాగా బిజీగా ఉన్నాడు.
కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న పవన్ మళ్లీ రీ ఎంట్రీ తో వరుస సినిమాలతో చాలా బాగా బిజీగా ఉన్నాడు.ఇదిలా ఉంటే పవన్ వ్యక్తిగత విషయాల గురించి అందరికీ తెలిసిందే.
ఇక ఆయనకు ఓ కూతురు కూడా ఉండగా ప్రస్తుతం తన కూతురు ఫోటోలు వైరల్ గా మారాయి.
తెలుగు సినీ నటి రేణు దేశాయ్ ను పవన్ కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
బద్రి సినిమాతో పరిచయమైన వీళ్లు ఆ తర్వాత పెద్దల సమక్షంలో ఒకటయ్యారు.ఇక వీరికి అకీరా నందన్ అనే కుమారుడు ఉన్నాడు.ఆద్య అనే కూతురు ఉంది.పవన్, రేణు విడిపోయిన తర్వాత పిల్లల బాధ్యత మొత్తం రేణు దేశాయ్ చూసుకుంటుంది.
అప్పుడప్పుడు తన పిల్లల ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది రేణుదేశాయ్.
ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిన రేణు దేశాయ్ కోవిడ్ నేపథ్యంలో పలు జాగ్రత్తలు తెలిపింది.తన వంతు సహాయంతో ముందుకు వచ్చింది.ఇక బుల్లితెరలో ఓ షోలో జడ్జిగా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక సోషల్ మీడియాలో తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది రేణుదేశాయ్.ఇక తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన కూతురు ఆద్య ఫోటో షేర్ చేసుకుంది.
అందులో ఆద్య ముఖానికి ఉండాల్సిన మాస్క్ తలపై ఉండేసరికి.అరే.మాస్క్ తలపై ఉందే.సారీ మమ్మీ.
ఇక నుంచి సరిగ్గా ధరిస్తాను.అని ఆద్య అన్నట్లు పోస్ట్ చేసింది రేణు.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారగా పవన్ అభిమానులు తెగ లైక్స్ కొడుతున్నారు.ఇక ఆ మధ్య రేణు దేశాయ్ జడ్జిగా చేస్తున్న డ్రామా జూనియర్స్ లో ఆధ్య బుల్లితెర పరిచయం చేసిన సంగతి తెలిసిందే.