ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సూపర్ సక్సెస్ ను దక్కించుకున్న రామ్ మరో సారి తన ఎనర్జిటిక్ ఫెర్ఫార్మెన్స్ తో సక్సెస్ అయ్యాడు.కాని ఆ వెంటనే వచ్చిన రెడ్ సినిమా నిరాశ పర్చింది.
దాంతో కాస్త గ్యాప్ తీసుకుని తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో సినిమాకు రెడీ అయ్యాడు.లింగు స్వామి ఒకప్పుడు తమిళంలో స్టార్ డైరెక్టర్.
కాని ఇప్పుడు మాత్రం ఆయన పెద్దగా సినిమాలు చేయలేక పోతున్నాడు.తమిళంలో ఆఫర్లు రాకపోవడంతో తెలుగు లో ప్రయత్నించి రామ్ తో సినిమా ను ఒప్పించాడు.
ద్వి భాష చిత్రం గా రూపొందబోతున్న ఈ సినిమా కు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నీయాంశంగా మారాయి.ఈ సినిమా గురించి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి నెట్టింట ప్రచారం జరుగుతోంది.
గతంలో విశాల్ తో పందెం కోడి వంటి ఒక మాస్ ఫ్యాక్షన్ మూవీని తెరకెక్కించిన లింగు స్వామి ఇప్పుడు రామ్ తో అదే తరహా ఒక మాస్ మసాలా యాక్షన్ కమ్ ఫ్యాక్షన్ స్టోరీని తెరకెక్కించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నాడు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ జరగడం లేదు.కాని కరోనా సెకండ్ వేవ్ పూర్తి అయిన వెంటనే ఆరు నెలల్లో సినిమా ను ముగించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.పెద్ద ఎత్తున షూటింగ్ ను నిర్వహించి సినిమా ను వచ్చే ఏడాది లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా లింగు స్వామి ప్రయత్నాలు చేస్తున్నాడు.ప్రస్తుత సమయంలో లింగు స్వామితో పాటు రామ్ కు కూడా ఈ సినిమా సక్సెస్ చాలా చాలా కీలకం.
అందుకే మాస్ మసాలా ఎలిమెంట్స్ ను కూడా ఈ సినిమా లో పుష్కలంగా ఉండేలా ఇద్దరు ముగ్గురు దర్వకులతో కూడా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయించినట్లుగా తెలుస్తోంది.మరి రామ్ కు మరో పందెం కోడి పడేనా చూడాలి.