ఏపీలో టీడీపీ పరిస్దితి పేకముక్కలో జోకర్లా మారిందని అనుకుంటున్నారట.ప్రస్తుతం టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న పెద్దబాబు, చిన్నబాబులు ఏది మాట్లాడిన ఆటలో అరటిపండులా వైసీపీ నేతలు తీసేస్తున్నారని ఇప్పటికే లోలోన మధనపడుతున్న ఈ తండ్రికొడులు పంక్చర్ అయి తుప్పు పట్టుతున్న సైకిల్ను పట్టుకుని సాహస యాత్ర చేస్తున్నారనే చెవాకులు పేలుతున్నాయి.
ఈ నేపధ్యంలో వైసీపీ మంత్రి అనిల్ కుమార్ టీడీపీ మీద మరో కడుపుబ్బ నవ్వించే కామేడీ జోకులను విసిరారు.ఏపీలో టీడీపీ పార్టీ, జూమ్ పార్టీ గా మారిందంటు ఎద్దేవా చేశారు.
వైసీపీ ప్రభుత్వం కరోనా నేపధ్యంలో తీసుకుంటున్న చర్యల పై జూమ్ ల ద్వారా విమర్శలు చేస్తున్న టీడీపీ కొన్ని రోజులకు మాయం అవుతున్న పార్టీగా ఏపీ ప్రజలు చెప్పుకుంటున్నారని వ్యాఖ్యానించారు.ఇకపోతే చంద్రబాబు జూమ్ పార్టీ అధ్యక్షులుగా మారారు.
పనిలో పనిగా మీరే సీఎం గా జూమ్ లో ప్రకటించుకోండి.అదీగాక మీ పార్టీ వారని ఐఏఎస్ గా, హైరిటేజ్ లో పని చేసే వారిని ఐపీఎస్ గా ప్రకటించుకోండంటూ విమర్శించారు.