ఆ నటి వయస్సు 69 సంవత్సరాలు. ఐదేళ్ల క్రితం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ నటికి మొదట్లో బాగానే ఆఫర్లు వచ్చాయి.
ఇప్పటికే అనేక భాషల్లో హిట్టైన బిగ్ బాస్ షో మలయాళం సీజన్ 2 లో కూడా కూడా ఆమె పాల్గొన్నారు.అయితే గతేడాది లాక్ డౌన్ అమలైన తరువాత క్రమంగా అవకాశాలు తగ్గడంతో పాశ్చాత్య వస్త్రధారణలో ఫోటోలు దిగి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ నటి పేరు రజినీ చాందీ కాగా నటిని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
సాధారణంగా యంగ్ హీరోయిన్లు అవకాశాల కోసం ఫోటో షూట్ లలో పాల్గొని గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తుంటారు.
కానీ ఏడు పదుల వయస్సులో రజినీ చాందీ చేయించుకున్న ఫోటో షూట్ వల్ల ఆమె నెటిజన్ల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంది.సాధారణంగా రజినీ చాందీ ఎక్కువగా చీరల్లో కనిపిస్తూ ఉంటారు.
అయితే కారణమేంటో తెలీదు కానీ ఫ్లోరల్ మాక్సీ, డెనిమ్ లు ధరించి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ ఫోటోలను చూసిన నెటిజన్లలో కొందరు ఈ వయస్సులో ఇదేం బుద్ధి.? అని కామెంట్లు చేస్తుంటే మరి కొందరు మాత్రం మీరు ఇంకా చనిపోలేదా.? అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.ఒరు ముతస్సి గాథ అనే సినిమాలో బామ్మ పాత్ర ద్వారా రజినీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు.అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఆమెను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో సానుకూలంగా స్పందిస్తున్నారు.
అయితే ట్రోలింగ్ పై కూడా స్పందించి రజినీ చాందీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
త్వరలో తనకు 70 సంవత్సరాలు నిండుతాయని.
ముసలావిడ అందంగా కనిపిస్తే కొందరు అసూయ పడుతున్నారని పేర్కొన్నారు.ఇలాంటి వ్యాపకాలు స్పూర్తిగా నిలుస్తాయని.
తనకు నచ్చిన పనిని తాను చేస్తున్నానని రజినీ చాందీ చెప్పుకొచ్చారు.రజినీ చాందీ వివరణ ఇచ్చినా ఆమెపై ట్రోలింగ్ ఆగకపోవడం గమనార్హం.