జబర్దస్త్ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ గా రష్మీ పాపులారిటీని సంపాదించుకున్నారు.ఈ షోతో పాటు సినిమాల్లో నటిస్తూ, ఈవెంట్లలో పాల్గొంటూ రష్మీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.
కొన్ని రోజుల క్రితం రష్మీ కరోనా బారిన పడగా ప్రస్తుతం రష్మీ మేకప్ లేకుండా దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ ఫోటోను చూసిన నెటిజన్లు రష్మీ మేకప్ లేకుండా బాలేదని కామెంట్లు చేస్తున్నారు.
రష్మీ మేకప్ లేకుండా గుర్తు పట్టలేకుండా ఉందని మరి కొందరు కామెంట్లు చేశారు.తన స్నేహితురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ తను చేసే క్రైమ్స్ లో భాగస్వామి అంటూ స్నేహితురాలితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయితే రష్మీ మేకప్ లెస్ ఫోటో గురించి నెగిటివ్ కామెంట్లు వ్యకమవుతూ ఉండటంతో రష్మీ అభిమానులు ఘాటుగా స్పందిస్తున్నారు.కొన్ని రోజుల క్రితం రష్మీకి కరోనా సోకడం వల్ల ముఖంలో గ్లో తగ్గిందని రష్మీ సాధారణంగా అందంగానే ఉంటుందని చెబుతున్నారు.
ఒకవైపు షోలతో బిజీగా ఉన్న రష్మీ హీరోయిన్ గా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా త్వరలో విడుదల కానుంది.ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా అందరికీ తగువులు పెట్టే పాత్రలో రష్మీ నటిస్తోంది.చాలా సినిమాల్లో రష్మీ హీరోయిన్ గా నటించినా గుంటూరు టాకీస్ తరువాత రష్మీకి ఆ సినిమా స్థాయిలో సక్సెస్ తెచ్చిపెట్టలేదు.గ్లామర్ ప్రాధాన్యత ఉన్న సినిమాలనే రష్మీ ఎక్కువగా ఎంచుకోవడం ఆమె కెరీర్ కు మైనస్ గా మారింది.
గతేడాది రష్మీ హీరోయిన్ గా నటించిన శివరంజని సినిమా ఫ్లాప్ కాగా కొంతకాలం కొత్త సినిమాలకు గ్యాప్ తీసుకున్న రష్మీ ఆ తరువాత బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.