రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లాలో టెక్కీ మనోజ్ఞ, ఆమె కూతురు తులసితో కలిసి అపార్టుమెంట్ నుంచి దూకేసిన ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.అయితే మనోజ్ఞ, తులసి పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
గుంటూరు జీజీహెచ్ అధికారులు తలకు బలమైన గాయం కావడం వల్లే మనోజ్ఞ చనిపోయిందని వెల్లడించారు.పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక మనోజ్ఞ, ఆమె కూతురు 36 నుంచి 48 గంటల మునుపే చనిపోయినట్టు తెలిపింది.అయితే మనోజ్ఞ భర్త కళ్యాణ్ మాత్రం 29వ తేదీన మనోజ్ఞ కూతురుతో కలిసి దూకి చనిపోయిందని చెబుతున్నారు.అయితే కూతురు తులసిని చంపి మనోజ్ఞ ఆత్మహత్య చేసుకుందా…? లేక మనోజ్ఞ, తులసిలను ఎవరైనా హత్య చేశారా….? అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.మనోజ్ఞ తల్లిదండ్రులు మాత్రం అత్తింటి వేధింపులే మనోజ్ఞ మృతికి కారణమని ఆరోపణలు చేయగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పోలీసులు మనోజ్ఞ భర్త కళ్యాణ్ కాల్ డేటాను పరిశీలిస్తే ఈ కేసులో వాస్తవాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు.సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేసే మనోజ్ఞకు ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంభొట్లవారిపాలేనికి చెందిన నావీ ఉద్యోగి కళ్యాణ్ తో వివాహం జరిగింది.
మనోజ్ఞ తల్లిదండ్రులు భారీగా కట్న కానుకలు ఇచ్చి వివాహం జరిపించారు.వీళ్లు హైదరాబాద్ లోని యూసఫ్ గూడలో కాపురం పెట్టగా తొమ్మిది నెలల క్రితం తులసి జన్మించింది.
అయితే కొంతకాలం నుంచి మనోజ్ఞకు అత్తామామల నుంచి, భర్త నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని తెలుస్తోంది.