అల్లు అర్జున్తో ఇప్పుడు సినిమాలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.పుష్ప సినిమా తర్వాత బన్నీ రేంజ్ వేరే స్థాయికి ఎదిగింది.
ప్రియమణి లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ స్టార్లు కూడా అల్లు అర్జున్తో ఒక సినిమా చేస్తే చాలు అని బాగా కోరుకుంటున్నారు.అయితే ఇలాంటి అదృష్టం ముగ్గురు హీరోయిన్ల వద్దకు వచ్చినట్లు వచ్చి మిస్ అయింది.వాళ్లు ఎవరో తెలుసుకుందాం.
సమంత
( samantha )
స్టార్ హీరోయిన్ సమంత ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో వచ్చిన “పుష్ప” సినిమాలో నటించాల్సి ఉంది.రష్మిక మందన్న కంటే ముందుగానే ఈ సినిమాలో నటించే ఛాన్స్ సమంతకు వచ్చింది.అయితే అదే సమయంలో ఆమెకు ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో రాజీ రోల్ చేసే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది.
దీంతో ఆమె ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకే మొగ్గు చూపింది.పుష్ప సినిమాను వదులుకుంది కానీ ఇందులో ఒక ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకుంది.ఈ ఐటమ్ సాంగ్ కోసం ఆమె ఐదు కోట్ల వరకు ఛార్జ్ చేసినట్టు సమాచారం.కానీ ఆమె ఒక పాన్ ఇండియా మూవీని కోల్పోయింది.
దీనికి పార్ట్ 2 సినిమా కూడా వస్తోంది.రెండు మంచి సినిమా అవకాశాలను ఈమె కోల్పోయినట్లు అయింది.
నయనతార
( Nayanatara )
తెలుగు అంథాలజీ హైపర్ లింక్ మూవీ “వేదం”లో అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్, మనోజ్ బాజ్పేయి, శరణ్య పొన్వన్నన్, నాగయ్య, దీక్షా సేథ్ వంటి వాళ్లు నటించారు.ఈ మూవీ కమర్షియల్ గా హిట్ కాలేదు కానీ చాలా నంది అవార్డ్స్ వచ్చాయి.బెస్ట్ యాక్టర్స్ గా అనుష్క ఓ నంది అవార్డును అందుకుంది.ఆమె వేశ్య సరోజగా కనిపించి మెప్పించింది.అయితే ఇంత మంచి పాత్రను నయనతార మిస్ చేసుకుంది.నిజానికి ఈ ఆఫర్ ను ఆమె రిజెక్ట్ చేసింది.
క్రిష్ జాగర్లమూడి ఆమెను ఈ పాత్ర కోసం అప్రోచ్ చేసినప్పుడు అది తన రేంజ్ మూవీ కాదని సింపుల్ కాదన్నదట.కానీ ఆమె ఇలాంటి మంచి పాత్ర పోగొట్టుకోవడం నిజంగా ఆమె దురదృష్టకరం.
కృతి శెట్టి
( krithishetty )
పుష్ప 2 సినిమాలో కృతి శెట్టిని ఐటమ్ సాంగ్ కోసం సుకుమార్ అప్రూచ్ అయ్యారట.అయితే ఆమె ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకోలేదని సమాచారం.