సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజుకు అభిమానుల సందడి అంతా ఇంతా లేదు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బయటకు వెళ్లలేరు.
కనుక ట్విట్టర్లో రచ్చ రచ్చ చేస్తున్నారు.రెండు వారాల క్రితం ట్విట్టర్లో మహేష్ బాబు ఫ్యాన్స్ సాధించిన రికార్డు గురించి ఇంకా చర్చ జరుగుతూనే ఉంది.ఒక్క రోజులో అంటే 24 గంటల్లో 3.1 కోట్ల ట్వీట్స్ ఆయన బర్త్ డే కామన్ డీపీకి వచ్చాయి అంటే మహేష్ ఫ్యాన్స్ నెట్టింట ఏ స్థాయిలో ట్రెండ్ అవుతున్నారో చెప్పుకోవచ్చు.
ఇక రేపు మహేష్బాబు పుట్టిన రోజు కావడంతో మరోసారి ట్విట్టర్ లో పిట్టతో కూత పెట్టించేందుకు ఫ్యాన్స్ రెడీ అయ్యారు.ఈసారి ఏకంగా 3.5 కోట్ల ట్వీట్స్ టార్గెట్ పెట్టుకున్నారు.మహేష్బాబు పుట్టిన రోజు ప్రారంభం అయ్యే అర్థ రాత్రి 12 గంటల సమయంలో ట్రెండ్ మొదలు కాబోతుంది.
నేడు రాత్రి నుండి రేపు రాత్రి 12 గంటల వరకు ట్రెండ్ కొనసాగుతూనే ఉంటుంది.ఈ ట్రెండ్ లో హ్యాపీ బర్త్డే మహేష్ హ్యాష్ ట్యాగ్ ను రికార్డు స్థాయిలో ట్వీట్స్ చేయాలనుకుంటున్నారు.
ఇక రేపు మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం నుండి ఒక పాటను విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి.దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు.అది కూడా అప్పటి వరకు కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తే.ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.రేపు మహేష్బాబు ఫ్యాన్స్ చేయబోతున్న ట్రెండ్ పై అందరి దృష్టి ఉంది.