ప్రభాస్ కోసం రంగంలోకి ఆస్కార్ విన్నర్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 20వ చిత్రంగా రాధేశ్యామ్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Ar Rahman To Give Music For Radhe Shyam, Ar Rahman, Prabhas, Radhe Shyam, Pooja-TeluguStop.com

సాహో వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తరువాత రాధేశ్యామ్ కూడా పాన్ ఇండియా మూవీగా వస్తుండటంతో ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కావడంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.

కాగా ఈ సినిమాకు సంగీతం ఎవరు అందిస్తున్నారనే అంశంపై మాత్రం ఇంకా సస్పెన్స్ వీడలేదు.గతంలో ఈ సినిమాకు బాలీవుడ్ మ్యుజీషియన్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడనే వార్తలు రాగా అవి నిజం కాదని తేలింది.

ఇక ఇటీవల జస్టిన్ ప్రభాకర్, ప్యాకియం వంటి పేర్లు వినిపించినా అవేవీ నిజం కాదని తెలుస్తోంది.అయితే ఇప్పుడు తాజాగా ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ రాధేశ్యామ్‌కు సంగీతం అందిస్తున్నాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది.

పాన్ ఇండియా మూవీ కాబట్టి ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ అయితే సరైన న్యాయం చేస్తాడనే వార్త వినిపిస్తుండటంతో ఈ సినిమాకు ఆయన అయితేనే బాగుంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అంటున్నారు.మరి ఈ సినిమాకు నిజంగానే ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తాడా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.

ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube