యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే.బాహుబలి, సాహో చిత్రాల తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు.
అయితే ప్రభాస్ మాత్రం తన ఫ్యాన్స్ పట్ల చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జరుపుకుని వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతుండటంతో ఈ సినిమా ఎలా వస్తుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఈ సినిమా ఫస్ట్ లుక్ను ఉగాది కానుకగా రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు.
కానీ కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయడం లేదని చిత్ర యూనిట్ ప్రకటించారు.దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ యువీ క్రియేషన్స్ను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో నానా రచ్చ చేశారు.
#BanUVCreations అనే హ్యాష్ట్యాగ్తో ట్విట్టర్ను దడదడలాడించారు.ఇది చూసిన ప్రభాస్ తన ఫ్యాన్స్కు సీరియస్ వార్నింగ్ ఇద్దామని అనుకున్నాడట.
అయితే పరిస్థితులు చేదాటకుండా ఉండేలా చిత్ర యూనిట్తో అఫీషియల్ స్టేట్మెంట్ ఇప్పించాడు.ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా పరిస్థితులు బాగాలేవని, అందుకే ఎవ్వరూ ఇంటి నుండి బయటకు రాకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాని, త్వరలోనే ప్రభాస్ 20వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపారు.
మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో కోపానికి గురయ్యారు.