కరోనా వస్తే వచ్చింది కానీ పేస్ బుక్ ఉద్యోగులకు మాత్రం బంపర్ ఆఫర్ తగిలింది.వారికి వర్క్ వర్క్ ఫ్రం హోం సదుపాయం తో పాటు ఆరు నెలల జీతం బోనస్ గా కూడా ఇస్తున్నట్లు ప్రకటించింది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలో టెక్ కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ కూడా తమ ఉద్యోగుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో, అందరికీ వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పిస్తూ సెలవలు ఇచ్చేసింది.
అయితే సెలవుల తో పాటువారికి మరో బంపర్ బొనాంజా తగిలింది.అదేంటంటే కరోనాతో ఆర్థిక ఇబ్బందులు కలగకుండా 6 నెలల వేతనాన్ని బోనస్గా ప్రకటించినట్లు తెలుస్తుంది.
సిబ్బంది ఖర్చులను దృష్టిలో ఉంచుకుని మరో 1,000 డాలర్లు అదనంగా ఇవ్వనున్నట్లు పేస్ బుక్ తాజాగా వెల్లడించారు.వెల్లడించింది.
సియాటిల్ లోని ఫేస్ బుక్ హెడ్ క్వార్టర్స్ లోని ఉద్యోగులతో పాటు సుమారు 45,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని ఫేస్బుక్ సీఈవో మార్క్ జకర్బర్గ్ వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణమృదంగం మెగిస్తొంది.మొత్తం మరణాల సంఖ్య 10,033కు చేరింది.పాజిటివ్ కేసుల సంఖ్య 2,45 850.కాగా 87 వేలకు పైగా బాధితులు కరోనా నుంచి కొలుకుంటున్నారు.అయితే చైనాను ఇటలీ మించిపోయింది.
ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 3,405.చైనా 3,245.
-ఇరాన్ 1,284.-స్పెయిన్ -831.
ఇప్పటివరకు భారత దేశంలో 5 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి.