టాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “లీడర్” అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రముఖ సినీ నిర్మాత కొడుకు రానా దగ్గుబాటి గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే రానా ఎప్పుడూ సరికొత్త కథనాలను ఎంచుకుంటూ మరియు విభిన్న ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు.
అంతేకాక రానా ఇటు హీరోగా అటు నెగిటివ్ రోల్ కలిగినటువంటి పాత్రలు కూడా చేస్తూ బాగానే తెలుగు ప్రేక్షకులని బాగా మెప్పిస్తున్నాడు.
అయితే ఇటీవలే రానా దగ్గుబాటి డిజిటల్ మీడియా ప్లాట్ ఫారంలోకి అడుగు పెట్టాడు.
ఇందులో భాగంగా చిన్నపిల్లలకి సంబంధించిన కామిక్ కార్టూన్స్ ని చూసేందుకు తనకు సంబంధించిన ఏసీకె మరియు టింకిల్ యాప్స్ లో ఉన్నటువంటి కథలను ఉచితంగా చదివేందుకు ఆఫర్లు ప్రకటించారు.ఇందుకుగాను మీరు చేయాల్సిందల్లా కేవలం ఈ అప్లికేషన్ లలో రిజిస్టర్ చేసుకోవడమే.
ఇలా ఒకసారి రిజిస్టర్ చేసుకున్న వాళ్లు దాదాపుగా 30 రోజుల పాటు ఉచితంగా ఈ యాప్ లో ఉన్నటువంటి కంటెంట్ ను తిలకించవచ్చు. అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ తరహాలోనే డిజిటల్ మీడియా ప్లాట్ ఫారంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కూడా “ఆహా” అనే యాప్ తో మంచి లాభాలను గడిస్తున్న నాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అరణ్య అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రభు సోలమన్ దర్శకత్వం వహిస్తున్నారు.అయితే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ తదితర భాషల్లో తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ట్రైలర్ కూడా విడుదల అయింది.ఈ టైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది.అయితే ప్రస్తుతం దేశంలో కకరోనా వైరస్ కలకలం సృష్టిస్తోందడంతో కొంతకాలం పాటు ఈ అరణ్య చిత్ర షూటింగ్ ని చిత్ర యూనిట్ సభ్యులు వాయిదా వేశారు.